లంబడిలాను కించపరిచేలా తీసిన బంజారా అనే సినిమా ప్రసారం నిలిపివేయలని జనగామ జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ముడావత్ సంపత్ నాయక్ అన్నారు. బంజరా సినిమాలో లంబడిలను అవమాన పరిచే విధంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని కోరుతూ జనగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్, ఎస్సై రాజేష్ కు ఫిర్యాదు చేశారు.
అదేవిధంగా చిత్ర యూనిట్ మీద చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సినిమాటోగ్రఫీ మంత్రి ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ ముడవత్ సంపత్ నాయక్ ,రామకృష్ణ నాయక్,నవీన్ నాయక్ ,సుమన్ నాయక్,కొమురెల్లి నాయక్ ,ఉమ్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.