రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల పై మరో ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది అగస్టు 17 తేదీ నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థ రివల్యూషనరి డెమొక్రటిక్ ఫ్రాంట్ పైనా మరొక ఏడాది పాటు నిషేధం పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ భద్రతా చట్టం 1992 ప్రకారం ఈ నిషేధ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేశారు.