దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని మెదిని సాంఘిక సేవాసంస్థ ప్రతినిధి కె ప్రకాష్ పిలుపునిచ్చారు. వరంగల్ నుండి మేడారం వరకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకాష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్బంగా నగరంలోని వరంగల్ మండలం 1వ డివిజన్ లోని సరళి హైస్కూల్ విద్యార్థులు ప్రకాష్ ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ప్రకాష్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. మేడారం జాతరలో భక్తులు చెట్లను నరకకుండా ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గాయత్రి, ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు శశిధర్, సతీష్, రాకేష్ కరుణ పృద్వి తదితరులు పాల్గొన్నారు.