లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఉప్పల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బి.ఎల్. ఆర్. చారిటబుల్ ట్రస్టు అధినేత బండారు లక్ష్మారెడ్డి నేడు నిత్యావసరాలు పంపిణీ చేశారు. సైనిక్ పురి లోని తన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
లాక్ డౌన్ లో ఎవరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో బండారు లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు. చర్లపల్లి ఆటో కార్మికుల అధ్యక్షుడు బాలారాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ మానవతా దృక్పథంతో నిత్యవసర వస్తువులు అందజేసిన లక్ష్మా రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేమురి మహేష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు బైరి నవీన్ గౌడ్, ఇంద్రయ్య కె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు