కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని శ్రీ సద్గురు బసవలింగప్ప సంస్థాన్ మట్ ఆవరణలో శ్రీ సద్గురు బండ అయ్యప్ప స్వామి పుణ్యతితి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే స్వామివారిసమాధి వద్ద రుద్రాభిషేకం నిర్వహించారు, అనంతరం లక్ష బిల్వర్చన,మహా మంగళహారతి వేదమంత్రాల మధ్య మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సోమలింగ శివాచార్య మహా స్వామీజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీపీ అశోక్ పటేల్ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు శ్రీహరి మర్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ తెరాస అధ్యక్షులు వెంకటరావు దేశాయిలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం