తెలంగాణ రాష్ట్ర బీజేపీ శిక్షణా కార్యక్రమం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ వద్ద అన్నోజిగూడలో ఉన్నఆర్వికే కేంద్రంలో ప్రారంభమైంది. పార్టీ సైద్ధాంతిక శిక్షణా తరగతుల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిక్షకులనుద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీలో ప్రతీ కార్యకర్త సైద్ధాంతిక నిబద్ధత కలిగి ఉండేలా నిర్మాణం చేయాలని ఈ శిక్షణా తరగతులే అందుకు వేదిక కావాలన్నారు. ప్రజలు మనపై పెట్టుకున్ననమ్మకాన్నివిశ్వాసాన్నినిలబెట్టెలా ప్రతీ కార్యకర్త సైనికుడిలా తయ్యారవ్వాలని పిలుపునిచ్చారు.
కేసిఆర్ గల్లీలో తొడలు కొట్టడం ఢిల్లీలో సలాంలు కొట్టడం తప్ప ఆయన చేసేదేం లేదన్నారు. బీజేపీ గెలుపు వాతావరణాన్ని దెబ్బ తీయాలని ఒక్కరోజు రైతులపై మొసలి కన్నీరు కార్చి భారత్ బంద్ లో పాల్గొన్నకేసిఆర్ ఢిల్లీకి వెళ్లి కూడా అక్కడ రైతుల ధర్నాకు ఎందుకు మద్దతు పలకలేదని, వారిని కనీసం ఎందుకు కలవలేదో? ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు.
కేసిఆర్ చేతిలో మోసపోయిన ప్రతీ వర్గాన్నికలుపుకొని పొయేవిధంగా పార్టీ కార్యకర్తలు సమాయత్తం కావ్వాలన్నారు.
రానున్నరోజుల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అందరూ సాయపడాలన్నారు.
ఇక రాష్ట్రంలో ఇక రెండే పక్షాలు ఒకటి బీజేపీ అనుకూల పక్షం, బీజేపీ వ్యతిరేఖ కూటమిగా టీఆరెస్, ఎంఐఎం, కాంగ్రెస్, కమ్యునిస్ట్ లు ఒక్క గూటి పక్షులే.. అని విమర్శించారు. బీజేపీ వ్యతిరేఖులంతా ఒక్క గూటి పక్షులే అనడానికి మొన్నటి రైతుల భారత్ బంద్ లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన రంగు జెండాల కలయికే సాక్ష్యమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి విమర్శించారు.