బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ హిందువుల పై చెయ్యి ఎత్తితే న్యూ సిటీ లో చేయి నరుకుతాం అని ఆయన అన్నారు.
అల్వాల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ మాదే న్యూ సిటీ కూడా మాదే నని ఆయన ప్రకటించారు. ఇది ఎవడి అయ్యా జాగీరు కాదు అంటూ ఆయన పరుషవ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ లో కొన్ని పత్రికలు అధికార పార్టీకి భజన చేస్తూ రాసే వార్తలతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.
బీజేపీ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇలా చేసే పత్రికలకు రానున్న రోజుల్లో తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు.