కరీంనగర్ బీజేపీ ఎంపీ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులేనని ,అలాంటి వారిని బ్రేకుల్లేని బస్సులో పాకిస్తాన్కు పంపుతానంటూ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ ఒవైసీ ఆటలు తెలంగాణలో సాగనివ్వమన్నారు.ట్రిపుల్ తలాక్ బిల్లు, అయోధ్యపై తీర్పు వంటి కీలక సమయాల్లో దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదని, కానీ సీఏఏ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినప్పటి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా కావాలని ఉద్యమాలు చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.తాము చెప్పటినవి ప్రజామోదం పొందిన చట్టాలని వాటిని వ్యతిరేకించడం సరికాదని , దీనికి వ్యతిరేకం గా ఎవరైనా రాళ్లు పట్టుకుంటే తాము బాంబులు పడతామని సంజయ్ హెచ్చరించారు.సంజయ్ హెచ్చరికల నేపథ్యం లో బిజెపి ,మజ్లీస్ పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నట్లు తెలుస్తుంది.