అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డికి పార్టీలో జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పగించడం పట్ల టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు.
ఏఐసీసీ కార్యదర్శి హోదాలో ప్రస్తుతం మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న వంశీకి నూతనంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ కి సహాయకుడిగా జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు బాధ్యతలు అప్పజెప్పడం సంతోషకరమన్నారు.
వంశీ చందర్ రెడ్డి విద్యార్థి ఎన్.ఎస్.యు.ఐ నేత నుండి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టికి విధేయుడిగా ఉండటంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంశీకి కీలక బాధ్యతలు ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసేందుకు ఈ బాధ్యతలు మరింత ఉపయోగపడతాయని బండి సుధాకర్ గౌడ్ అభిప్రాయపడ్డారు.