ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఆదివారం వార్డు కార్యాలయం లో రజక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ కేటీఆర్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి రజక వృత్తిదారులకు ఉచిత కరెంటును అందజేస్తున్నామని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే బంగారు తెలంగాణ లక్ష్యమని
అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మడేల్లయ రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడల మల్లేష్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి సాంబరాజు , మల్లేష్, కనకరాజు, రాజు, సాయికిరణ్,కళ్యాణ్ రాజ్, మల్లేష్, శీను, రాజు, రమేష్, శ్యామ్, నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి