బంగ్లాదేశ్లో రెండు పడవలు ఢీకొన్న ప్రమాదంలో 26 మంది దుర్మరణం పాలయ్యారు. సోమవారం బంగ్లాదేశ్ లోని షిబ్చర్ పట్టణ సమీపంలోని పద్మానదిలో రెండు ఇసుక పడవలు ఢీకొట్టడం తో 26 మంది నదిలో పడి మునిగి మృత్యువాత పడ్డారు.పడవల్లో ఘటన సమయం లో పడవలో 31 మంది ఉండగా, వారిలో ఐదుగురిని కాపాడామని బంగ్లాదేశ్ పోలీసు చీఫ్ మీరజ్ హోసేన్ చెప్పారు.అగంరిబాన్ శాఖ, పోలీసులు నదిలో మునిగిన వారి కోసం గాలింపు చేపట్టారు. పడవల నిర్వహణ సరిగా లేకపోవడం, ఎక్కువ మంది పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు చెప్పారు.
previous post