25.7 C
Hyderabad
January 15, 2025 19: 18 PM
Slider జాతీయం

దేశంలో పెరిగిపోతున్న బ్యాంకు శాఖలు

#Minister Nirmala Sitharaman

దేశవ్యాప్తంగా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలు 3,792 పెరిగి మొత్తం 1,65,501కి చేరుకున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వెల్లడించారు. 2014 నుండి 2024 మధ్య కాలంలో బ్యాంకుల విస్తరణ విస్తృతంగా జరిగిందని ఆమె తెలిపారు. వీటిలో 85,116 ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశంలో లభించే బ్యాంకింగ్ సేవలను విస్తరించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని సీతారామన్ పేర్కొన్నారు. ముద్రా రుణాల విషయానికొస్తే, 68% రుణాలు మహిళలకు ఇచ్చినట్లు సీతారామన్ తెలిపారు. స్వనిధి పథకం కింద కూడా 44% రుణాలు మహిళలకు మాత్రమే ఇస్తున్నారని ఆమె వివరించారు. మహిళలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతున్నాయని, తద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే అవకాశాలు పెరుగుతున్నాయని ఆమె చెప్పారు.

Related posts

డిమాండ్: వాయిదా కాదు మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

మరో 4 మెడికల్‌ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ మార్చి 26 విడుదల

Satyam NEWS

Leave a Comment