నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఆర్డీవో పరిధిలోని అన్ని కేసులను వాయిదా వేయాలని న్యాయవాదుల బార్ అసోసియేషన్ తీర్మానించుకుని ఆర్డీవో రాజేష్ కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో కక్షిదారుల, న్యాయవాదుల ఆరోగ్యాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ముందు జాగ్రత్త చర్యగా జూలై 25 వరకు ఆర్డిఓ కార్యాలయంలోని అన్ని కేసులు వాయిదా వేయాలంటూ కల్వకుర్తి ఆర్ డి ఓ రాజేష్ కుమార్ కు అందచేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. తమ వినతికి వారు సానుకూలంగా స్పందించినట్లు జూలై 25 వరకు కేసులు వాయిదా వేస్తున్నట్లు అంగీకరించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చిందం కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ న్యాయవాదులు రాంగోపాల్, యాది లాల్ తదితరులు పాల్గొన్నారు.