తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను కించపరుస్తూ లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది.
న్యాయవ్యవస్థలపై స్వయంగా సీఎం ఇలాంటి దాడులు చేయడం గర్హనీయమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతీసేందుకే.. జగన్ లేఖ రాశారని, జగన్పై అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేసింది.
సుప్రీంకోర్టు లో రెండవ సీనియర్ అయిన జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం వాంఛనీయం కాదని వారు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను బెదిరించేందుకే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని వారు అన్నారు.