31.2 C
Hyderabad
April 19, 2024 06: 07 AM
Slider ముఖ్యంశాలు

జగన్ లేఖను తప్పుపట్టిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

#Bar Council of India 1

తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను కించపరుస్తూ లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది.

న్యాయవ్యవస్థలపై స్వయంగా సీఎం ఇలాంటి దాడులు చేయడం గర్హనీయమని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతీసేందుకే.. జగన్ లేఖ రాశారని, జగన్‌పై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసింది.

సుప్రీంకోర్టు లో రెండవ సీనియర్ అయిన జస్టిస్ ఎన్వీ రమణపై ఆరోపణలు చేయడం వాంఛనీయం కాదని వారు అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను బెదిరించేందుకే జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని వారు అన్నారు.

Related posts

రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువ చేయాలి

Satyam NEWS

ఎవరినైనా నొప్పిస్తే అన్యధా భావించవద్దు: కలెక్టర్ సూర్య కుమారి

Satyam NEWS

వైవీ సుబ్బారెడ్డికి సుబ్రహ్మణ్య స్వామి బాసట

Satyam NEWS

Leave a Comment