28.7 C
Hyderabad
April 25, 2024 06: 29 AM
Slider ఆదిలాబాద్

బాసర ఆలయాన్ని సందర్శించిన కమిషనర్

#BasaraTemple

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఆలయానికి ఎటువంటి బాకీ లేకున్నా నోటీసులు పంపుతున్నారని కొందరు కమిషనర్ అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆలయ నోటీసుల వ్యవహారంపై క్రింది స్థాయి అధికారుల పై వ్యాపారులు కూడా ఫిర్యాదులు చేశారు. దాంతో ఆయన ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ కారణంగా వ్యాపారం సాగడం లేదని అందువల్ల టెండర్లు పట్టుకున్నవారికి తీవ్ర నష్టాలు వాటిల్లాయని దేవాలయ వర్తక సంఘం దేవాదాయ శాఖ కమిషనర్ ను కలసి వినతిపత్రం అందచేశారు. తమ డబ్బును తిరిగి చెల్లించాలని వినతిపత్రం అందచేశారు. దుకాణ యజమానులకు న్యాయం చేస్తానని దేవాదాయ శాఖ కమిషనర్ హామీ ఇచ్చారు.

Related posts

తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో రిగ్గింగ్ కు రెక్కీ?

Satyam NEWS

షూటెడ్:విశ్వహిందూ చీఫ్‌‌‌‌‌‌‌ రంజిత్ బచ్చన్‌ కాల్చివేత

Satyam NEWS

కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment