నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి నేడు విశేష పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మాజీ కమిషనర్ P. సుందర్ కుమార్ సతీసమేతంగా నేడు అమ్మవారిని దర్శించుకున్నారు.
మాజీ దేవాదాయశాఖ కమీషనర్ సుందర్ కుమార్ కు ఆలయ మర్యాదాలతో స్వాగతము పలికి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందచేశారు.