35.2 C
Hyderabad
April 20, 2024 15: 32 PM
Slider హైదరాబాద్

స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన

#asraonagar

కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోనీ  కాప్రా డివిజన్ గాంధీనగర్  స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసిన ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గాంధీనగర్  స్మశాన వాటికలో పిచ్చి మొక్కలను తొలగించి, అదనంగా నాలుగు హైమాస్ట్ పోల్స్ ఏర్పాటు చేయించి, విద్యుత్ తీగలను సవరించి పరిసరాల శుభ్రం చేయించారు.

గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. మహేష్ తో పాటు సభ్యులు, కాంగ్రెస్ యువ నాయకులు తోటకూర శ్రీకాంత్ విజ్ఞప్తి మేరకు గతవారం రోజులుగా  స్మశాన వాటిక శుభ్ర పరిచేందుకు చర్యలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అద్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సహకరించిన జిహెచ్ఎంసి కాప్రా డిసి శంకర్, సహాయ వైద్య ఆరోగ్య అధికారిణి డాక్టర్ స్వప్నరెడ్డి, విద్యుత్ విభాగం డిఈ రవీంద్ర, ఇంచార్జ్ రాకేష్, జవాన్లు దశరథ, అశోక్ లకు, యువ నాయకులు టి. శ్రీకాంత్ లకు పేరుపేరునా గాంధీనగర్ బస్తీవాసులు, గాంధీనగర్ యూత్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ ల కలకలం…..

Satyam NEWS

కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన అగ్నిప్రమాదం

Bhavani

స్టోరీ బిగిన్స్: కోయంబేడు వెళ్ళిన వ్యక్తికి కరోనా

Satyam NEWS

Leave a Comment