హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ లోని తులసి నగర్ కాలనీలో స్థానిక సమస్యలపై కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కాలనీలో రహదారి నిర్మాణం పనులు పెండింగ్ లో ఉన్నాయని, ప్రధాన రహదారులపై మ్యాన్ హోల్స్ పగిలిపోయి ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
వరద నీటి కాలువల పూడిక తీయించాలని కోరారు.
రోడ్డు పనులకు ఇప్పటికే నిధులు శాంక్షన్ అయ్యాయని, రెండు వారాలు లోపల రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు.
జిహెచ్ఎంసి సిబ్బంది ఇప్పటికే అన్ని కాలనీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారని మిగిలిన అన్ని ప్రాంతాల్లో శుభ్రం చేసి బ్లీచింగ్ చదువుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తులసి నగర్ సంక్షేమ సంఘం సభ్యులు రామకృష్ణ బాబాయ్, చంద్రశేఖర్ రెడ్డి ,డాక్టర్ శ్రీనివాస్, గోపి అనిల్ ,సుక్ దేవ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.