హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన ఎల్లమ్మబండ లో బీజేపీ నాయకులు బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు.
డివిజన్ అధ్యక్షులు కమలాకర రెడ్డి ఆధ్వర్యంలో KTR బస్తీ లో ప్రజా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ బస్తీ వెనక చెరువు నుండి దుర్గంధం వస్తున్నదని, పందులు, పాములు వస్తున్నాయని, డ్రైనేజీ పైపులు పగిలిపోయాయని ఫిర్యాదు చేశారు.
వాటర్ కనెక్షన్లు ఇచ్చానా నీళ్లు రావడం లేదని వారు తెలిపారు. ఉన్న బోరు నుంచి ఉప్పు నీరు వస్తున్నాయని, వాటినే మూడు రోజులకు ఒక సారి వదులుతున్నారని వారు తెలిపారు.
స్థానిక కార్పొరేటర్ కి చెప్పినా పట్టించుకోవడం లేదని తెలియజేశారు. KTR బస్తీలో నెలకొన్న బస్తీ సమస్యలను సోమవారం జరిగే ప్రజావాణి లో స్థానిక అధికారుల దృష్టికి తెచ్చి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని బిజెపి నేతలు తెలిపారు.
సమస్యలు పరిష్కరం కాకపోతే జీహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా నాయకులు కేశవ రావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్, మణిభూషణ్,
డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘు, వైస్ ప్రెసిడెంట్ రాజు, కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి, యువ మోర్చా ప్రెసిడెంట్ రాహుల్, యువ మోర్చా నాయకులు రాజు, కిరణ్, మోహన్, మొహమ్మద్, శివాజీ, సాయి గౌండ్, సతీష్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.