- జపాన్ లోకల్ ట్రైన్లో దారుణం జరిగింది. జోకర్ మాస్క్ ధరించి వచ్చి ఓ యువకుడు ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ ఘటనలో కనీసం 17 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
దాడి చేసిన వ్యక్తి బాట్మాన్ జోకర్ దుస్తులలో ఉన్నాడు. అకస్మాత్తుగా రైలులోకి వచ్చిన దుండగుడు ప్రయాణికులపై కత్తితో దాడి చేయడం మొదలు పెట్టాడు. ప్రయాణికులపై దాడి చేసిన అంతరం పొట్రోల్ పోసి బోగీని తగలబెట్టాడు.