ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్నఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనికి తోడు మరి కొన్నిగంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్నిదాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇప్పటికే నివర్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడులు ఆ ఎఫెక్ట్కు ఇంకా తేరుకోలేనే లేదు. ఇంతలో అధికారులు వెల్లడించిన సమాచారంతో ఒకింత భయాందోళనకు గురవుతున్నారు.