ప్రమాదాలు సంభవించినప్పుడు భయపడకుండా సంయమనంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాదాల నివారణలో రక్షణ దళం పనిచేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అగ్నిమాపక దళం అధికారి నజీర్ పేర్కొన్నారు.
50వ జాతీయ రక్షణ దినం సందర్భంగా బట్టు వారి పల్లి గ్రామంలోని గ్రీన్ కో గాలి మరల కంపెనీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో ఆధునిక పరికరాలు అగ్నిమాపక యంత్రాలు ఉపయోగించి మంటలను అదుపుచేసే మెలకువలను వివరించారు.
పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక దళానికి సమాచారం అందిస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ కో కంపెనీలో పని చేస్తున్నా సెక్యూరిటీ సిబ్బంది ఇంజనీర్లు కంపెనీ అధికారులు పాల్గొన్నారు.
కె ఎల్ ప్రసాద్, రిపోర్టర్, కళ్యాణదుర్గం