విశాఖపట్నంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భోగాపురం విమానాశ్రయం, బీచ్ కారిడార్, విశాఖకు పోలవరం జలాల తరలింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
మెట్రో ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. విశాఖ-భీమిలి బీచ్రోడ్డు విస్తరణ,భీమిలి-భోగాపురం బీచ్ రోడ్డు నిర్మాణంపై చర్చించారు.
బీచ్ రోడ్డు నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేయాలని సీఎం చెప్పారు. భీమిలి-భోగాపురం రోడ్డుకు రూ.1,167 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జగన్ ఆదేశించారు.