గుంటూరు జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం జిల్లాలో నడుస్తున్న 6 కోవిడ్ ఆసుపత్రులలో ఉన్న పడకలను పెంచుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆసుపత్రుల లోని పెంచిన పడకల వివరాలు:
1) NRI ఆసుపత్రి 300 నుండి 750 కి, 2) ప్రభుత్వ ఆసుపత్రి GGH, గుంటూరు 249 నుండి 600, 3) కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రి 245 నుండి 600, 4) మణిపాల్ ఆసుపత్రి 30 నుండి 50, 5) AIIMS, మంగళగిరి 16 నుండి 30 పడకలకి పెంచారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రయివేట్ ఆరోగ్యశ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను కూడా కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు అనుమతించారు.