35.2 C
Hyderabad
April 20, 2024 16: 02 PM
Slider ఆదిలాబాద్

బేలా బై పాస్ రోడ్డు మంజూరికి వినతి పత్రం

#nitingadkari

నాగపూర్  లో  ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి బేలా బైపాస్ రోడ్డు కోసం వినతి పత్రం అందచేశారు.

ఆదిలాబాద్ నాగపూర్ జాతీయ రహదారి నం. 44 ను అనుసంధానం చేస్తూ రాజూర మీదుగా చంద్రాపూర్ వరకు ఉన్న అంతర్రాష్ట్రీయ రహదారి 363D గా మంజూరు ఐయ్యింది. ఐతే ఈ రహదారి బేలా గ్రామం మధ్య నుండి వెళుతుంది ఈ రహదారి వల్ల భారీ వాహనాల రాకపోకలు అధికమయ్యి తరచు భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రహదారిని బేలా గ్రామానికి బై పాస్ ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కోరడం జరిగింది. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. దీనికి అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

ఎంపీ సోయం బాపూరావు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ధన్యవాదాలు తెలియ చేశారు.

Related posts

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మృతి

Satyam NEWS

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

Satyam NEWS

క్వారంటైన్ లో ఉన్న 11 మంది ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి

Satyam NEWS

Leave a Comment