బెర్లిన్ నగరంలో 12 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సోమవారం జర్మనీ పోలీసులు వెల్ల డిం చారు. నిందితులంతా న్యూజి లాండ్లోని క్రిస్ట్చర్చ్ మసీదుల్లో జరిగిన దాడుల తరహా కాల్పులకు కుట్ర పన్నారని చెప్పారు. ఉగ్రసంస్థలకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై 8 మందిని, బెర్లిన్ నగరంలోని మసీదుల్లో బాంబులు అమర్చేందుకు రెక్కీ నిర్వహించిన ఆరోపణలపై మరో నలుగురిని అరెస్ట్ చేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
అరెస్టయిన నిందితుల్లో మితవాద లక్షణాలను గుర్తించా మని అన్నారు. నిందితులను ఫెడరల్ సుప్రీంకోర్టులో హాజరు పరిచామని అన్నారు. జర్మనీలో శాంతిభద్రతలకు విఘా తం కల్గించాలని నిందితులు కుట్ర పన్నారని అన్నారు. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని అన్నారు. కాగా, గతేడాది మార్చి15న న్యూజిలాండ్లోని క్రిస్ట్చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో కాల్పులు జరిగాయి. బ్రెంట్ టారెంట్(28) అనే ఉన్మాది మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న ముస్లింలపై కాల్పులకు తెగబడ్డాడు.