27.7 C
Hyderabad
April 19, 2024 23: 58 PM
Slider నెల్లూరు

నెల్లూరు ఎంపీ ఆదాల కు దేశవ్యాప్త వదాన్యత ప్రశంస

#AadalaPrabhakarareddy

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి కరోనా సమయంలో చేసి న వధాన్యత కు గానూ దేశవ్యాప్త ప్రశంస లభించింది.  కరోనా మహమ్మారి కబళించిన సమయంలో దాని నివారణకు గాను తన నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆయన తన సొంత నిధులు అధికంగా కేటాయించారు.

అందుకు గాను  దేశంలోనే ఆయనకు రెండో స్థానం లభించింది. మొదటి స్థానం అనిల్ ఫిరోజియా కు లభించగా, మూడో స్థానం రాహుల్ గాంధీకి లభించింది.

న్యూఢిల్లీకి చెందిన సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫామ్ అనే ఒక సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక సర్వేలో 25మంది ఎంపీలకు స్థానం లభించింది. అందులో నెల్లూరు ఎంపీ రెండో స్థానాన్ని పొందడం పట్ల పలు ప్రశంసలు లభించాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల దిన పత్రిక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించింది.

Related posts

ఏపిలో నాలుగు రోజుల పాటు బయటకు రావద్దు

Satyam NEWS

Political turmoil : మరో బ్రిటన్ మంత్రి రాజీనామా

Satyam NEWS

22 నుంచి 4 రోజుల‌ పాటు మంత్రి బొత్స సొంత జిల్లా పర్యటన

Satyam NEWS

Leave a Comment