30.7 C
Hyderabad
April 16, 2024 23: 15 PM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వోద్యోగులూ పారాహుషార్… అతను వైకాపా ఏజెంట్

#NB25

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా, వైసీపీ పార్టీకి ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి అన్నారు.

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు. వెంకట్రామిరెడ్డి భార్య శ్వేతా వెంకటరామి రెడ్డి వైసిపి కార్యకర్త, ఆమె 2012 నుంచి హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో వైసీపీ తరపున పని చేస్తున్నారని ఆయన తెలిపారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో వెంకట్రామిరెడ్డికి  కూడా వై ఎస్ జగన్ రెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని సుధాకర్ రెడ్డి తెలిపారు.

అయితే నామినేషన్ సమయానికి, ప్రభుత్వ ఉద్యోగి అని బయటపడటంతో, నామినేషన్ వెయ్యటానికి వీలు పడలేదని ఆయన తెలిపారు. దీంతో వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, వైసీపీ తరపున ప్రచారం చేశారని సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా వెంకటరామి రెడ్డి సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారని, చంద్రబాబు అధికారంలోకి రావటంతో, 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేసాడని సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్న తరుణంలో వారిని రెచ్చగొట్టారని, వారు అమరావతి రాకుండా చేద్దామనుకున్నారని సుధాకర్ రెడ్డి తెలిపారు.

అయితే అతని పాచికలు పారలేదని, ఉద్యోగులంతా తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించారని ఆయన గుర్తు చేశారు.  జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాకర్ల వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవిలోకి వచ్చారు.

 అప్పటి నుంచి జగన్ రెడ్డి చెప్పినట్లే వెంకటరామిరెడ్డి చేస్తున్నారని డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి తెలిపారు.

Related posts

క్యాన్సర్, కోవిడ్ తో ఏక కాలంలో పోరాడి గెలిచిన మహిళ

Satyam NEWS

అద్భుత పాలనతో అగ్రగామిగా తెలంగాణ

Satyam NEWS

నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్న బిజెపి నేత

Satyam NEWS

Leave a Comment