అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 13మందిని భద్రాద్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.