నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన్ బేట్ల గ్రామం లో అక్రమ చర్చి నిర్మాణం నిలిపివేయలని భజరంగ్ దళ్ పురెందర్ డిమాండ్ చేశారు. మంగళవారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డిఓ తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు భజరంగ్ దళ్ పురెందర్ మాట్లాడుతూ ఎన్మన్ బేట్ల గ్రామ హిందువులను పట్టణ ప్రాంతాల్లో వుండే పాస్టర్ లను ఆదివారం పిలిపించి పెద్ద సౌండ్ సిస్టం ద్వారా క్రైస్తవ మతానికి సంబంధించిన పాటలను ప్రార్థనలు పెడుతూ ప్రజలకు ఇబ్బంది గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
అంతే కాకుండా హిందువుల దేవి, దేవుళ్లను తిడుతూ హిందువుల మనోభావాలను దెబ్బ తిస్తున్నారన్నారు. హిందువు లను మభ్యపెడుతు మతమార్పిడిలు చేస్తున్నారు.ఇదంత గ్రామ సర్పంచ్ సహకారంతో గ్రామంలో ప్రభుత్వ భూమిలో చర్చి నిర్మాణం చేయడం చేస్తున్నారు. చట్టువుండే హిందువు ప్రజలు చర్చి నిర్మాణాన్ని నిలిపివేయలని చెబుతున్నా, నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ చర్చి నిర్మాణం వెంటనే నిలిపివేయాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది అన్నారు. లేకపోతే భజరంగ్ దళ్, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పులి భరత్, సాయి కృష్ణ గౌడ్,కృష్ణ,శివ తదితరులు పాల్గొన్నారు.