నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ కార్యాలయంలో శుక్రవారం నాడు సాయంత్రం 5 గంటలకు వెంకటగిరి మున్సిపాలిటీ 3 వ చైర్ పర్సన్ గా నక్కా భానుప్రియ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ…వెంకటగిరి మునిసిపల్ ఎన్నికలలో గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజాసేవే ధ్యేయంగా… వెంకటగిరి పట్టణ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని అన్నారు.
ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు అని… వెంకటగిరి మున్సిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తి అయిందని, గత ఎన్నికలతో పోలిస్తే… 2 వార్డులు మాత్రమే గెలుచుకున్న వై ఎస్ ఆర్ సి పి… ఈ ఎన్నికలలో 25 వార్థులకు గాను 25 వార్డులలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసి వెంకటగిరి మున్సిపాలిటీలో ఒక చరిత్ర సృష్టించిందని అన్నారు.
ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిపాలనా దక్షత, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కారణం తో పాటు స్థానిక నాయకుల, కార్యకర్తల సమిష్టి కృషి మీడియా ప్రతినిధుల సహకారం కారణమన్నారు.
విజ్ఞులైన వెంకటగిరి పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా మరొక సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆనం అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, పార్టీ విప్ తో పాటు… కౌన్సిలర్లు అందరికీ ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటగిరి సంస్థానాధీశులు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వి.బి. సాయికృష్ణ యాచేంద్ర, స్థానిక నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కె.రమాకాంత్, సీనియర్ పాత్రికేయుడు