సాగు చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం తాడేపల్లిలో సీపీఐ, సీపీఎం ,వైసిపి, టీడీపీ, కాంగ్రస్, ఎస్పీ, అప్ తదితర పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు.
అనంతరం మున్సిపల్ ఆఫీసు ను, బ్యాంకులను దగ్గరుండి మూసివేయంచి బంద్ కు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాల రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బంద్ను శాంతియుతంగా నిర్వహించి తమకు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీపీఐ,నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, పట్టణ సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య,సీపీఎం నేతలు వేముల దుర్గారావు,
బి వెంకటేశ్వర్లు,సోలా ముత్యాల రావు,వైసిపిస్థానిక సంస్థల రాష్ట్ర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి,కె ప్రభకార్,కేళి వెంకటేశ్వర్రావు,టీడీపీ పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావుఅద్దంకి మురళి,ఓలేటి రాము,ఇట్టా పెంచాలయ్య,కె శైలేజా,కాంగ్రస్ పార్టీ నేత దర్శనపు సామ్యల్,తదితరులు పాల్గొన్నారు.