37.2 C
Hyderabad
March 28, 2024 17: 53 PM
Slider హైదరాబాద్

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాలి

#balakrishna

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసగించారు.

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్​ శతజయతి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని మాసబ్​ట్యాంక్​లో ఏర్పాటు చేసిన మినీ మహానాడు, ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాలకు నటుడు నందమూరి బాలకృష్ణ మఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని పేర్కొన్నారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలు అన్నదమ్ములుగా కలిసే ఉండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు.

రాష్ట్రంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ప్రతి తెలుగు వ్యక్తి గుండె పొగరుతో నినదిస్తోందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సామాన్యుల కోసం ఎన్టీఆర్​ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. ఎందరో రాజకీయనేతలకు మంచి మంచి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు. మన దేశంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారని గుర్తు చేశారు.

మండల వ్యవస్థ, మహిళ యూనివర్శిటీ, వెనుక బడిన సామాజిక వర్గాలు వారికి రిజర్వేషన్లు పెంచారని తెలిపారు. ఇలా ఎన్టీఆర్​ తీసుకొచ్చిన పథకాలు, హైదరాబాద్​లో ఆయన హాయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నందమూరి తారక రామారావుకు ‘భారత రత్న’ ఇవ్వాలని నందమూరి కుటుంబం, రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల తరఫున డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, నందమూరి సుహాసినీ, సాయిబాబా, గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు

Related posts

లయన్స్ క్లబ్ ఆఫ్ రాజంపేట ఆధ్వర్యంలో గొడుగులు పంపిణీ

Satyam NEWS

వ్యాక్సినేషన్ ఇంత స్లోగా జరిగితే మూడో వేవ్ గ్యారెంటీ

Satyam NEWS

రైతు బిల్లును ఉపసంహరించుకోవాలని నేడు బైక్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment