27.7 C
Hyderabad
April 25, 2024 09: 47 AM
Slider కడప

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ని విమర్శించే స్థాయి భత్యాల కు లేదు

YCP Kadapa

కడప జిల్లా రాజంపేట టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డిని విమర్శించే అర్హత లేదని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు.

కడప జిల్లా రాజంపేట లోని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా స్పోక్స్ పర్సన్ మర్రి రవి, సౌమ్యనాధ స్వామి టెంఫుల్ ఛైర్మన్ సౌమిత్రి, రాజంపేట మార్కెట్ యార్డు ఛైర్మన్ గొబ్బిల్ల త్రినాథ్ , స్టేట్ బి.సి డైరెక్టర్ లక్ష్మి నరసయ్య , హాస్పిటల్ కమిటీ మాజీ ఛైర్మన్ వడ్డే రమణ , మాజీ ఎంపీటీసీ గుల్జార్ బాష ,ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ డైరెక్టర్ సత్యాల రామకృష్ణ , ధనుంజయ నాయుడు, రాజ, పత్తి నారాయణ , షేక్ సయ్యద్, కోళ్ళ రమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా మేడా తీసుకోవచ్చిన 850 కోట్లు భత్యాల తండ్రి గారివో, చంద్రబాబు నాయుడు తండ్రి సొంత సొమ్ము కాదని అది ప్రజల సొమ్ము ని అన్నారు.

రాజంపేట ఎమ్మెల్యే ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు కానీ మీలాంటి వాళ్ళకు కాదని అన్నారు. కడప జిల్లా మొత్తంలో ప్రజాభిమానంతో గెలిచిన ఏకైక శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

క్యాష్, క్యాస్ట్ టార్గెట్ చేసుకుని రాజ కీయాలు చేసే భత్యాలకు రాజంపేట నియోజక వర్గంలో స్థానం లేదని గత ఎన్నికలలో బలంగా నిరూపించుకున్నారన్నారు.

Related posts

రెపో రేటు పెంచుతూ ఆర్ బి ఐ నిర్ణయం

Satyam NEWS

సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

Satyam NEWS

ఘనంగా బర్త్ డే జరుపుకున్న అందాల నటి నందిని రాయ్

Satyam NEWS

Leave a Comment