ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానంలో శ్రీ శార్వరీ నామ సంవత్సర భవానీ మండల దీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. 25 నుంచి 30వ వరకు భవానీలకు మాలాధారణ మండల దీక్షలు చేయనున్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి.
అలాగే డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17 నుండి 19 వరకు అర్ధమండల మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు సత్య నారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి.
2021 జనవరి 5 నుంచి 9 వరకు మాలా విరమణ మహోత్సం జరుగనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభంకానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది.