32.2 C
Hyderabad
March 29, 2024 21: 17 PM
Slider కృష్ణ

25నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం

Bhavani Deekshalu

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానంలో శ్రీ శార్వరీ నామ సంవత్సర భవానీ మండల దీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. 25 నుంచి 30వ వరకు భవానీలకు మాలాధారణ మండల దీక్షలు చేయనున్నారు. 25వ తేదీ ఉదయం 8 గంటలకు భవానీ దీక్షలు ప్రారంభంకానున్నాయి.

అలాగే డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 17 నుండి 19 వరకు అర్ధమండల మాల ధారణ దీక్షలు జరుగనున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు సత్య నారాయణపురంలోని శివరామ కృష్ణ క్షేత్రం నుండి జ్యోతులు ప్రారంభమవుతాయి.

2021 జనవరి 5 నుంచి 9 వరకు మాలా విరమణ మహోత్సం జరుగనుంది. జనవరి 5న ఉదయం 6:50 గంటలకు అగ్నిప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నికుండములు ప్రారంభంకానుంది. జనవరి 9న ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగింపు జరుగనుంది.

Related posts

నల్లబజారుకు పేదవాడి రేషన్ బియ్యం

Satyam NEWS

ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి శంకుస్థాపన

Bhavani

రేషన్‌ డోర్‌ డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Satyam NEWS

Leave a Comment