భీష్మ ఏకాదశి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైభవంగా జరుగుతున్నాయి.
అన్నవరం సత్యదేవుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు సత్యదేవుడిని దర్శించుకుంటున్నారు.
రాత్రి 11 నుండే వ్రతాలు చేయించుకునే భక్తులకి టిక్కెట్లు విక్రయించారు.
ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు తాకిడి నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు.