పాండిశ్చేరి రాష్ట్రం తిరునల్లార్ శనీశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు మహాలింగ గురుకల్ (మాలి) దంపతులు శుక్రవారం కాప్రా విచ్చేశారు. ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడలోని కల్పవల్లి ఇన్ ఫ్రా ప్రధాన కార్యాలయంలో భూవరాహ లక్ష్మీ నారసింహస్వామి, శనీశ్వరులకు అర్చకులు మహాలింగ గురుకల్, దిలీప్ కుమార్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు భక్తులకు ఆశీర్వచనాలను అందజేశారు. అనంతరం తులసీవనం లోని గోశాలలో నందనంపాటి రామాంజనేయులు (రాము) ఆధ్వర్యంలో నిర్వహించిన గోపూజ, సేవలో దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సనపల శ్రవణ్ కుమార్, సౌమ్య, కొత్త రామారావు, కళ్యాణ చక్రవర్తిలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి