కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వీడియో కాల్ లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి సోనియాగాంధీ కి ఆయన వివరించారు.
కరోనా విషయంలో రాష్ట్రంలోని TRS ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన సోనియాగాంధీకి వివరించారు. మీరు ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో విలవిల లాడుతోంది మీరే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అని ఆమెను కోరారు.
రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయడంలేదని, కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన తెలిపారు. ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని అదేమని ప్రశ్నించేవారిని వేధిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పులు ఊబిలో పడివేశాడని ఆయన తెలిపారు. మీరు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పగించారు. ఆయన దాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు అని సోనియాగాంధీకి వివరించారు.