హెరిటేజ్ సంస్థ ఎండీ…టీడీపీ అధినేత చంద్రబాబు భార్య…మీడియాకు లేఖ…!
ఇటీవలే ఏపీ శాసనసభలో మాజీ సీఎం,ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భార్యనుద్దేశించి సభ్యలు ఆడిన మాటలతో బాబు తీవ్ర భావోద్వేగానికి గురై మీడియా ముందే ఏడ్చారు. దీంతొ అప్పుడే టీడీపీ ఎమ్మెల్యేలంతా అధికార పార్టీ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా హెరిటేజ్ సంస్థ అధినేత , చంద్రబాబు భార్య భువనేశ్వరి మీడియాకు ఓ లేఖ విడుదల చేసారు. శాసనసభలో నాపై అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అలాగే నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం జీవితంలో మర్చిపోలేనని తెలిపారు. నాకు చిన్నతనం నుంచి మా అమ్మనాన్న విలువలతోనే పెంచారని..ఇప్పటికీ వాటిని మేము పాటిస్తునే ఉన్నామన్నారు. నైతిక విలువలతో కూడిన సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని కష్టాలు, ఆపదల్లో ఉన్నవారికి అండగా నిలబడాలన్నారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని..అసెంబ్లీ సాక్షిగా నాకు జరిగిన ఈ అవమానం ఎవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నానంటూ ఆమె లేఖ విడుదల చేసారు.