కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నీలావర్ మల్లిఖార్జున్ సోమవారం తన పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ జిల్లా అధికారిణి రమ్య వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు వివరించాలన్నారు.ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే రైతుబంధు రైతుబీమా లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.ఈ కార్యక్రమానికి అసెంబ్లీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి రావాల్సి ఉండగా ఆయన ఆరోగ్యం దృష్ట్యా రాలేకపోయారన్నారు.ఆయన బదులు ఆయన కుమారులు పోచారం సురేందర్రెడ్డి హాజరుకావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ దఫేదార్ రాజు,బాన్సువాడ నాయకులు పోచారం సురేందర్రెడ్డి,రైతు సమన్వయ సమితి జిలా అధ్యక్షులు అంజిరెడ్డి ,ఎంపీపీ అశోక్ పటేల్, సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ(బాలు), రాజు శ్రీహరి , డీసీసీబీ బ్యాంకు డైరెక్టర్ రామ్పటేల్,మదునుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్,బిచ్కుంద తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, జుక్కల్ తెరాస అధ్యక్షులు బొల్లి గంగాధర్,కొడపుగల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, నిజాంసాగర్ నాయకులు దుర్గారెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు సిబ్బంది ఉన్నారు.
సత్యం న్యూస్ జుక్కల్