ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఎన్నికలకు ముందే నాల్చర్ బాలాజీ బిచ్కుంద సొసైటీ చైర్మన్ గా ప్రకటించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుండి ఆయన గెలుపొందగా సొసైటీ చైర్మన్ గా నల్సర్ బాలాజీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 13 టి సి ల గాను 11 టీసీలు టిఆర్ఎస్ విజయం సాధించాయి. దీంతో బాలాజీ చైర్మన్ కావడానికి మార్గం సుగమైంది. ఆదివారం చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో ముందుగా గెలుపొందిన టీ సీలకు నియామక పత్రాలను అందజేశారు.
బాలాజీ చైర్మన్ గ వైస్ చైర్మన్గా యాదవ రావు ను ఎన్నికల అధికారి కిషోర్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సహకార సంఘం కార్యాలయ సిబ్బంది, జెడ్పిటిసి భారతి రాజు ,ఎంపీపీ అశోక్ పటేల్, ఆయా గ్రామాల సర్పంచులు చైర్మన్, వైస్ చైర్మన్, టి సి లకు సన్మానం చేశారు. గెలుపొందిన టీసీలు, చైర్మన్ బాలాజీ, వైస్ చైర్మన్ యాదవ్ రావు మాట్లాడుతూ తమ గెలుపుకు ఎంతో కృషి చేసిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.