39.2 C
Hyderabad
April 25, 2024 16: 56 PM
Slider ప్రత్యేకం

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల కుంభకోణం

#pannalaharishreddy

మొదటి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన హరీష్ రెడ్డి.. తెలంగాణ వ్యాప్తంగా తొలివిడత 100శాతం వ్యాక్సినేషన్ డోస్ లు పూర్తి అయినట్లు ప్రకటన చేస్తూ కేకులు కట్ చేసిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఏ ప్రాతిపదికన నివేదిక విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు ఆధార్ కార్డులను ఆధారంగా చేసుకుని టీకాలు వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఓటర్ లిస్ట్ ప్రకారం టీకాలు వేసిందని, ఆన్ లైన్ లో ఉన్న ఓటర్ లిస్ట్ తీసుకుని దాని ప్రకారం టీకాలు వేసినట్లు చెబుతున్నా క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంకా 25 నుండి 30శాతం మందికి మొదటి డోస్ టీకా కూడా వేయలేదని, కానీ టీకా వేసుకున్నారంటూ మెసేజ్ లు పంపారని అన్నారు. జీహెచ్ఎంసీలో 160 సెంటర్లలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని వీటిలో 10లక్షల డోస్ లు పక్కదారి పట్టాయని, ఈలెక్కన ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు రూ.160 నుండి 200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.  ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో నరహంతక పాలకులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు హరీష్ రెడ్డి. కరోనా టీకాల అవినీతికి సంబంధించి విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు.

Related posts

అధికార పార్టీకి చెందిన రెండో ఎమ్మెల్యేకు పాజిటీవ్

Satyam NEWS

బేగంపేటలో టిడిపి అభ్యర్ధికి విశేష మద్దతు

Satyam NEWS

మళ్ళీ వర్షాలు |

Murali Krishna

Leave a Comment