ఉప్పల్ నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరి అయిన సందర్భంగా ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయం హప్సిగూడలో సిఎం కేసీఆర్ చిప్రటానికి ఎమ్మేల్యే బేతి సుభాష్రెడ్డి పాలాభిషేకం చేశారు.
అనంతరం బాణసంచా పేల్చి , స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే సుభాష్రెడ్డి మాట్లాడతూ పేద విద్యార్ధుల పాలిట దైవం కేసీఆర్ అని అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ విద్యార్ధుల కల సాకారం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్కి , విధ్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో కార్పోరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పోరేటర్ గధం జోత్న్సనాగేశ్వరరావు, సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, సాయిజన్ శేఖర్, గంధం నాగేశ్వరరావు, మేకల ముత్యంరెడ్డి, వేముల సంతోష్రెడ్డి, జీనత్బేగం, శ్రావణ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.