అదుపు లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసులను తట్టుకోలేక బీహార్ రాష్ట్రం మళ్లీ లాక్ డౌన్ దిశగా వెళుతున్నది. ఈ నెల 16వ తేదీ నుంచి 31 వరకూ రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తన ట్విట్లర్ ఖాతాలో వెల్లడించారు. విస్తరిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదు, మందు లేదు, లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
బీహార్ లోని చాలా జిల్లాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయినా అదుపు కాకపోవడంతో రాష్ట్రం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని బిజెపి నాయకులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారు. బిజెపి కార్యాలయంలో 20 మందికి కరోనా సోకింది. వారిలో సీనియర్ బిజెపి నాయకులు నలుగురు ఉన్నారు.