హర్ష ఫౌండేషన్ హిమబిందు రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ కాళి మందిరం నుంచి రుషికొండ గీతం కాలేజి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రారంభించారు.
బైక్ ర్యాలీ లో ఇంచార్జి మంత్రి కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవి సత్యనారాయణ, బి సత్యవతి, జి మాధవి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్, వాసుపల్లి గణేష్ కుమార్, బూడి ముత్యాల నాయుడు, భాగ్యలక్ష్మి,టి నాగిరెడ్డి, రమణమూర్తి రాజు, కరణం ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జివిఎంసి కమిషనర్ సృజన తదితరులు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వాహనం నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలని ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. అమెరికా లాంటి దేశాలతో సరి చూసుకోకూడదని, మన దేశ పరిస్థితులు దృష్టి లో పెట్టుకోవాలని, బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి రావాలి అంటే సేఫ్ డ్రైవ్ చేయాలని ఆయన అన్నారు.
ఈ ర్యాలీ లో పాల్గొన్న సినీ నటులు అలీ, ఖయుమ్, తనీష్, అశు రెడ్డి, దీక్షా పంత్ తదితరులు ఈవ్ టిసింగ్ ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.