సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండల కేంద్రంలో నిత్యం పూజలందుకొంటున్న శ్రీ ఇష్ట కామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస బహుళ సప్తమి తిథి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పరమ శివునికి అత్యంత ప్రీతికరమైన త్రిదళ బిల్వార్చన,అన్నాభిషేకం చేస్తే పరమ శివుడు పరవశించి అన్నపానాదులకు లోటు లేకుండా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లగా కాపాడుతాడనే విస్వాసంతో భక్తులు భక్తి శ్రద్ధలతో శంభు లింగేశ్వర స్వామి వారికి త్రిదళ మారేడు లక్ష బిల్వార్చన,అన్నాభిషేకం ఇష్టకామేశ్వరీ అమ్మవారికి కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు గణపతి పూజ నిర్వహించి, భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి స్వయంభు శంంభులింగేశ్వర స్వామి వారికి మారేడు దళ లక్ష బిల్వార్చన నిర్వహించారు.అనంతరం అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు.
శుక్రవారం కావటంతో ఇష్టకామేశ్వరీ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు.అనంతరం స్వామి,అమ్మవారిని విశేషంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి,మహా నీరాజనం, మంత్రపుష్పం సమర్పించిన పిదప తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొంకపాక శివవిష్ణు వర్ధన్ శర్మ, కొంకపాక ధనుంజయ శర్మ,వేద పండితులు,ఆలయ మేనేజర్, గుడిపాటి రాధిక,ఓరుగంటి మనీషా,చీదెళ్ళ శోభారాణి,గట్టికొప్పుల పద్మావతి,గుడిపాటి ఉషారాణి,గర్రె కవిత,హైమవతి,ప్రభావతి, సావిత్రి,అరుణ అచ్చయ్య,సోమలక్ష్మి, రవికుమార్,శైలజ,రాజేష్,యక్షిత్,ఖుషాల్, సాయి, అత్యధిక సంఖ్యలో భక్తులు కరోనా నియమనిబంధనలు పాటిస్తూ తమ తమ మ్రెక్కులు తీర్చుకున్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్