నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజల భాగ స్వామ్య సమస్త పి.బి.ఎస్ వృద్ధాశ్రమంలో నేమ్స్ నెఫ్రాలజీ హెచ్ ఓ డి డాక్టర్ భూషణ్ రాజు జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గా పిబిఎస్ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు దుప్పట్లను నిర్వాహకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటయ్య మాట్లాడుతూ వృద్ధులకు అన్ని రకాల వస్తువులు కల్పించడంతోపాటు వారిని అన్ని విధాలుగా వసతులు కల్పించి ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటయ్య మేనేజర్ మల్లేష్ కౌన్సిలర్ పరుశురాం వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.