కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి మనవరాలు, మర్రి అభిషేక్ రెడ్డి, ప్రియ రాగా దంపతుల కుమార్తె యస్విక రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలను వరంగల్ అటోనగర్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
సుమారు 30 మంది విద్యార్థులకు మిఠాయిలు పంచి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ CWC చైర్మెన్ అనితా రెడ్డి, మర్రి నీరజ, పర్కాల రవీందర్ రెడ్డి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ పుట్టిన రోజు పండుగ అంటేనే మనం సంతోషంగా ఉండడం, పదిమందిని సంతోషపెట్టడం అని అన్నారు.
మానవ సేవ మాధవ సేవ అని భావిస్తూ పుట్టిన రోజు వేడుకలను అంధుల పాఠశాలలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. అంధులు సేవ దైవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయ సహకారాలు అఁదిఁచాలని కోరారు.