పేదవారికి విద్యాబుద్ధులు నేర్పించే లక్ష్యంతో విజయా విద్యా సంస్థలు స్థాపించి వెనుకబడిన ప్రాంతాలలో వెలుగులు నింపుతున్న అమృతలత కు హైదరాబాద్ పాత నగర కవుల వేదిక తరపున కె హరినాథ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న అమృత లత స్వార్ధం లేకుండా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయని ఆయన అన్నారు.
నిరంతర సేవాభావ సంకల్ప అమృత వర్షిణి, అపురూపా అవార్డ్స్ అధినేత్రి అయిన అమృత లత మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. విజయా ఉన్నత పాఠశాల, విజయా ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి అందరి హృదయాలలో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారని హరినాథ్ అన్నారు.
ఆధ్యాత్మికంగా వేంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించి ఇటు నిజామాబాద్, అటు ఆర్మూర్ ప్రజలకు భక్తి మార్గాన్ని ఏర్పరిచారని ఆయన అన్నారు. ఇంత మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న అమృత లత గారికి పాత నగర కవుల వేదిక తరపున ప్రత్యేకంగా నా నుంచి అభినందన అక్షర మాలికలు అందిస్తున్నట్లు హరనాథ్ తెలిపారు.