39.2 C
Hyderabad
April 25, 2024 18: 14 PM
Slider నిజామాబాద్

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

#BJPBichkunda

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై దాడికి నిరసనగా  మంగళవారం జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద ,మద్నూర్, పెద్దకొడప్గల్ ,పిట్లం ,నిజాంసాగర్ మండలాలలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశాయి.

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ   దుబ్బాక ఉప   ఎన్నికల్లో తెరాస ఓడిపోతుందన్న భయంతో కెసిఆర్ అండతో హరీశ్ రావు  భాజపా అభ్యర్థి  రఘునందన్ రావు కు  లేని పోని నిందలు అంటగడుతున్నారన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలిచేది భాజపానేనని  వారు  స్పష్టం   చేశారు. అధికార పార్టీకి తొత్తులుగా అక్కడున్న అధికారులు మారారని దుయ్యబట్టారు.

భాజపా అధ్యక్షునిపై దాడికి  తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అనంతరం రాష్ట్ర అర్థిక మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భాజాపా అధ్యక్షులు బిచ్కుంద కిష్టారెడ్డి, మద్నూర్ హనుమాన్లు, జుక్కల్ ప్రశాంత్ పటేల్ ,పిట్లం అశోక్రాజు, కొడప్గల్ గంగాధర్,బీజేవైఎం నాయకులు  బిచ్కుంద విష్ణు, మద్నూర్ సంతోష్ ,జుక్కల్ పవన్కుమార్, పెద్దకొడప్గల్ నవీన్, పిట్లం క్రాంతికుమార్,

బిచ్కుంద  బిచ్కుంద ప్రధానకార్యదర్శి పత్తి రమేష్ ,బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సందీప్ ఐటి సెల్ కన్వీనర్ లక్ష్మణ్ చారి, శ్రీధర్ పంతులు తదితరులున్నారు.

Related posts

మళ్లీ గుండెల్లో దడ: బాబుకు మోదీ పిలుపు

Bhavani

స్వామీజీ అనుగ్రహంతో అమెరికా పర్యటన దిగ్విజయంగా పూర్తి

Satyam NEWS

సూపర్ స్టార్ కృష్ణ మృతి వార్త పై దిగ్భ్రాంతి

Bhavani

Leave a Comment